మధిర, ఏప్రిల్ 26 : రాష్ట్రంలో గుంటనక్కల పాలన కొనసాగుతుందని, దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం అని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ మధిరలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేసేందుకు అమలుకు వీలుకానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్లు దుయ్యబట్టారు. ఆశపడి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు.
ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు వచ్చేవారు క్రమశిక్షణతో వారికి కేటాయించిన బస్సుల్లోనే రావాలన్నారు. వేసవికాలం కావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం పూటనే బయల్దేరి సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద రైతుబంధు మాజీ కన్వీనర్ చావా వేణుబాబు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి అరేగ శ్రీనివాసరావు, ముత్తారపు ప్యారి, వంకాయలపాడు నాగేశ్వరరావు, కటికల సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల నాగబాబు, బొగ్గుల వీరారెడ్డి, కొత్తపల్లి నరసింహారావు, యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, ఉమామహేశ్వర్ రెడ్డి, చిదిరాల రాంబాబు పాల్గొన్నారు.