‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ఆ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. మున్నేరు వరదలు తగ్గుముఖం పట్టడంతో ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
-ఖమ్మం, జూలై 28
ఖమ్మం, జూలై 28: ఖమ్మం నగరంలో, ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. మున్నేరు వరదలు తగ్గుముఖం పట్టడంతో ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఏడాది మున్నేరు ఉధృతంగా ప్రవహించిందని అన్నారు. ఈ ముప్పును సమర్థవంతంగా ఎదురొన్న అధికారులకు, సిబ్బందికి అభినందిస్తున్నామని అన్నారు. మున్నేరు వరదల వల్ల ఎకడా ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సతీశ్ అని యువకుడు అతడి పొరపాటు వల్లనే మృత్యువాత పడ్డాడని అన్నారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే శానిటేషన్ను ప్రారంభిస్తామని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మున్నేరు పూర్తిస్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. యూహెచ్సీలు, పీహెచ్సీలు 24 గంటలపాటు వైద్య సేవలందించాలని ఆదేశించారు.
మున్నేరు పరీవాహకంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయడం వల్లనే వరద ముప్పును ఎదుర్కోగలిగామని, ప్రాణనష్టం జరుగకుండా కాపాడుకోగలిగామని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను చకదిద్దుతూ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అజయ్కుమార్కు, సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
మున్నేరు ముంపు ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేలా అన్ని చర్యలూ తీసుకున్నామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆపద వేళ అధికార యంత్రాంగం చకగా పనిచేసిందని అన్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సేవలు వర్ణించలేనివని అన్నారు.
ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేసేందుకు, వైద్య సేవలు అందించేందుకు పొరుగు ప్రాంతాల నుంచి అదనపు సిబ్బందిని నియమిస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సీపీ విష్ణు మాట్లాడుతూ.. వరదల తదనంతర పనులనూ అధికారులు తమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.
కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా, డీసీసీబీ, టీఎస్ సీడ్స్, ఏఎంసీ చైర్మన్లు బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, దోరేపల్లి శ్వేత, అదనపు కలెక్టర్లు అభిలాష, మధుసూదన్నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధికాగుప్తా, వివిధ శాఖల అధికారులు శంకర్నాయక్, బోస్, అప్పారావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సత్కరించారు.
ఖమ్మం రూరల్, జూలై 28: మున్నేరు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరదల్లో మునిగిన ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలగంనగర్, కేబీఆర్ కాలనీ, నాలుగో ఉద్యోగుల కాలనీ, ఆర్టీసీ కాలనీ, సాయిప్రభాత్నగర్ కాలనీలు మున్నేటి వరదలో మునిగిపోయాయయని, అయితే శుక్రవారం తెల్లవారుజామలోపు ఈ కాలనీల్లోని 90 శాతం ఇళ్లు వరదనీటి నుంచి బయటపడ్డాయని అన్నారు. వీధుల్లో పేరుకపోయిన వరద మట్టిని పంచాయతీల సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, మూడు రోజుల్లో కాలన్నీలన్నింటినీ యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. ఇతర పంచాయతీల ట్రాక్టర్లను, సిబ్బందిని రప్పించి శుభ్రం చేయించాలని సూచించారు. అనంరతం వీధుల్లో బ్లీచింగ్ చల్లించి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయా కాలనీల్లో బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అప్పారావు, అశోక్కుమార్, సుమ, శ్రీనివాసరావు, బెల్లం ఉమా, యండపల్లి వరప్రసాద్, బెల్లం వేణు, గూడ సంజీవరెడ్డి, లక్ష్మణ్నాయక్, ముత్యం కృష్ణారావు, బానోత్ మోహన్ పాల్గొన్నారు.