పాల్వంచ, మార్చి 14: విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో పాండురంగాపురం సెంటర్లో రాష్ట్ర అధ్యక్షుడు వజీర్ అధ్యక్షతన గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డీఏ ఇవ్వాలని కోరుతూ సీఎండీకి లిఖిత పూర్వకంగా విన్నవించినా సమస్య ఇప్పటికీ పెండింగ్లోనే ఉందని అన్నారు. నాయకులు రాధాకృష్ణ, శ్రీధర్, అంబాల శ్రీను, సురేశ్, వెంకటేశ్వర్లు, ధనయ్య, పుల్లారావు, నాగేశ్వరరావు, యుగంధర్ పాల్గొన్నారు.