ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీందర్రావు,కె.కృష్ణయ్యలు మాట్లాడుతూ 14 నెలల బకాయిలు 36 వాయిదాలు కాకుండా ఏకమొత్తంగా చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మూడు వాయిదాల పెండింగ్ కరువు బత్యాన్ని వెంటనే ప్రకటించాలని, 2018 జులై తరువాత రిటైర్డ్ అయినవారికి నూతన పీఆర్సీ అమలు జరుగటం లేదన్నారు.