చండ్రుగొండ, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తిప్పనపల్లిలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీఆర్ఎస్ దిమ్మెపై శనివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడడంలో కార్యకర్తలు ముందుండాలన్నారు.
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రియాశీలకంగా మారాలనుకోవడం శుభ సూచికమన్నారు. కేంద్రంలోని బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ గాదె లింగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపీటీసీలు దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ జడ వెంకయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా మోహన్రావు, గాదె శివప్రసాద్, భూపతి రమేశ్, భూపతి శ్రీనివాసరావు, వంకాయలపాటి బాబూరావు, గుగులోత్ రమేశ్, కళ్లెం వెంకటేశ్వర్లు, సయ్యద్ గపార్మియా, అంచ కృష్ణ, సుంకర రామారావు, ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.