కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.. దీంతో యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయి అదే నెల 30న పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచే అధికారులు సిబ్బందితో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. పార్టీ జెండాలు, రాజకీయ పోస్టర్లను తొలగింపజేశారు. పొలిటికల్ వాల్ రైటింగ్స్పై పెయింట్ వేయించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, నోడల్ అధికారులను నియమించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై అప్రమత్తం చేశారు.
– ఖమ్మం, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3న ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. 30న పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచే అధికారులు సిబ్బందితో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. పార్టీ జెండాలు, రాజకీయ పోస్టర్లను తొలగింపజేశారు.
పొలిటికల్ వాల్ రైటింగ్స్పై పేయింట్ వేయించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, నోడల్ అధికారులను నియమించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించకూడదని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయించారు. ఇతర ప్రాంతాల నుంచి నగదు, మద్యం తరలిరాకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టించారు. తక్షణ ఫిర్యాదుల స్వీకరణ కోసం సి-విజిల్ యాప్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వచ్చే నెల 30న జరుగనున్న పోలింగ్కు అధికారులు జిల్లావ్యాప్తంగా 1,455 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. పోలింగ్ సమయంలో ఒక్కో కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు(ఓపీవో) విధులు నిర్వహించనున్నారు. అందుకు గాను జిల్లావ్యాప్తంగా మొత్తం 5,900 మంది నియమితులయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ స్వయంగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు పోలింగ్కు ఒకరోజు ముందే కేంద్రాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించే వైద్యారోగ్యశాఖ, పశుసంవర్థక, అటవీ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, అగ్నిమాపకశాఖ అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల విధుల్లో మినహాయింపు ఉన్నది. పోలింగ్ విధుల్లో అత్యధికంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు భాగస్వాములు కానున్నారు. పోలింగ్ సిబ్బంది, అధికారులకు సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో విధులు నిర్వర్తించనున్నారు.
కూసుమంచి, అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల హడావుడి షురూ అయింది. వచ్చే నెల 30న పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. ఈనేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కలెక్టర్ వీపీ గౌతమ్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులు కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు.