బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలలో హెల్త్కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని, విద్యావాలంటీర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీను ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఎస్.ఎస్.రామరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కే.యాకుబ్పాషా, జిల్లా కౌన్సిలర్లు నాగేశ్వరరావు, రమేష్, ఉపాధ్యక్షులుగా రాఘవులు, హరిప్రసాద్, రవికిరణ్ జానకీ, కార్యదర్శులుగా బీ.వెంకన్నలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.