సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. దీం తో స్పందించిన అధికారులు రెండు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం రక్షిత మంచి నీరు సరఫరా అవుతున్నది. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలు యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. యైటింక్లయిన్ కాలనీలోని కార్మిక, కార్మికేతర కుటుంబాల నీటి కష్టాలు తీరిపోయాయి. రామగుండం రీజియన్ పరిధి గోదావరిఖని శివారులోని గోదావరి ఫిల్టర్ బెడ్ నుంచి మూడు డివిజన్లలో కార్మిక, కార్మికేతర కుటుంబాలకు మంచినీరు సరఫరా అవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గోదావరి నిం డుకుండలా ఉండడంతో కొంత కాలంగా సింగరేణి సరఫరా చేసే పైపులైన్ల నుంచి కలుషిత నీరు వస్తున్నది. కార్మిక సంఘాల విజ్ఞప్తితో గమనించిన యాజమాన్యం కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్జీ-2 ఏరియాలో రక్షిత మంచినీ రు సరఫరా చేయడానికి నడుం బిగించింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్లి, డైరెక్టర్ల చొరవతో రూ.30 లక్షలు నిధులు వెచ్చించి కాలనీలో రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏ ర్పాటు చేసింది. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా రెండు రోజుల క్రితం వాటర్ ప్లాంట్లను ప్రారంభించగా, కార్మిక కుటుంబాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రోజుకు 8 గంటలు
యైటింక్లయిన్ కాలనీ పట్టణంలోని అల్లూరు రోడ్డులో రూ.16.50 లక్షలు వెచ్చించి 2 వేల లీటర్ల సామర్థ్యంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అలాగే పోతన కాలనీలో మ రో రూ.16.50 లక్షలతో ఇంకోటి ఏర్పాటు చేసింది. కాలనీలో దాదాపు 25వేల జనాభా ఉంటుంది. ఈ కుటుంబాలకు గత కొంత కాలంగా పైపులైన్ల నుంచి కలుషిత నీరు వస్తున్నదని గమనించిన అధికారులు కార్మిక, కార్మికేతర కుటుంబాలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని సంకల్పించారు. బొగ్గు ఉత్పత్తిపైనే గాకుండా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రూ.30 లక్షలతో ఈ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఇక మీదట ప్రతి రోజూ 8 గంటల పాటు నిరంతరం ఈ స్వచ్ఛమైన నీటిని స్థానిక కుటుంబాలకు సరఫరా చేయనుంది. ఇతర మౌలిక అవసరాల కోసం రోజువారీగా నల్లాల ద్వారా ఎప్పటిలాగే మంచినీరు సరఫరా చేయనుంది. దీంతో కాలనీలో కార్మిక, కార్మికేతర కు టుంబాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డం
ఇదివరకు నల్లాల ద్వారా వచ్చే తాగునీరు అంత స్వచ్ఛంగా ఉండేది కాదు. వానకాలంలో ఏకంగా రంగు మారిన కలుషిత నీ రు వచ్చేది. ఆ నీరు తాగడానికి ఇబ్బందికరంగా ఉండేది. ఒక్కో సారి అనారోగ్యం పాలయ్యేది. తప్పనిసరిగా వేడి చేసి చల్లార్చిన నీటినే తాగేవాళ్లం. ఇప్పుడు ఈ ఆర్యో వాటర్ ప్లాంట్లతో స్వచ్ఛమై న నీరు సరఫరా చేస్తున్న సింగరేణికి కృతజ్ఞతలు.
– కుమ్మరి సదానందం
సంతోషంగా ఉంది
స్థానికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో సింగరేణి రెండు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం చాలా సం తోషంగా ఉంది. ఇదివరకు స్వచ్ఛమైన నీటి కోసం డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు సింగరేణి ఉచితంగా శుద్ధమైన నీటిని పంపిణీ చేస్తుండడం సంతోషంగా ఉంది. ఈ శుద్ధిచేసిన నీటితో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
– భిక్షపతి, కాలనీ