వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులుగా పుచ్చకాయల చెన్నారావును ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, పార్టీ ఉపాధ్యక్షులు గుత్తా శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, సర్పంచ్ పుచ్చకాయల సుధాకర్, నాయకులు నూనె హరిబాబు, రావూరి శ్రీను, మారోజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.