ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వరద సహాయ చర్యల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పా టు చేయడం జరిగిందని అందుకోసం 9063211298 నెంబర్కు వరద సహాయక చర్యల సమాచారాన్ని తెలియజేస్తే సత్వర సహాయక చర్యలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
1077 టోల్ ఫ్రీ నెంబర్కు కుడి కాల్ చేసి చెప్పొచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. నీటి పారుదల, రోడ్లు భవనాలు, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ యంత్రాంగంతో మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులను నివారణ, ముందస్తు చర్యలకు కార్యస్థానాల్లో అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ వీపీ.గౌతమ్ సూచించారు.