భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్లుండె.. రైతులు, భూ యజమానులు ఉసూరుమంటూ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాలె. బంట్రోతు నుంచి పెద్ద సారు వరకు అందరి చేయీ తడపాలె. అయినా.. పని అవుతుందనే నమ్మకం లేదు. అనుభవదారు ఒకరుంటరు. పట్టాదారు మరొకరుంటరు. పట్టా ఒకరి పేరుపై మరొకరికి పేరు మారేది. ఆ విషయం భూయజమానికి మాత్రం తెలిసేది కాదు. తీరా.. తెలిసిన తర్వాత గొడవల పరంపర సాగేది. కొన్ని వివాదాలు వారసత్వంగా తరాలను ప్రభావితం చేసేవి. ఒక్క భూసమస్య రెండు కుటుంబాలను ఛిద్రం చేసేది. కాంగ్రెస్ పాలనలో అమలైన ఈ పట్వారీ విధానంలో అవినీతి కోరలు చాచేది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి, అధికారులను లంచావతారులుగా మార్చిన కాంగ్రెస్ ఇప్పుడు తేనెపూసిన మాటలను ప్రయోగిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో అమలు చేస్తున్న ‘ధరణి’పై విషం కక్కుతున్నది. రైతు ధీమాగా, దర్జాగా ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే ‘భూమాత’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ధరణితోనే తమ భూములు భద్రంగా ఉంటాయని ముక్తకంఠంతో ప్రకటిస్తున్నరు.
ఖమ్మం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ పరిపాలనను శైలిలో గాడిలో పెట్టారు. భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు.. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పైసా ఖర్చు లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ భూములు అమ్ముకోవడం, కొనుగోలు చేసుకోవడం కోసం సులభతరంగా మారింది. ఈ క్రమంలో భూముల విలువ కూడా పెరిగింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సజావుగా నడుస్తున్న ధరణి పోర్టల్పై కన్నేసిన కాంగ్రెస్ దానిని ఎలాగైనా తొలగించాలని కంకణం కట్టుకున్నది. పదే పదే తొలగిస్తామని ఎన్నికలు సభలు, సమావేశాల్లో వల్లెవేస్తోంది. దాని స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొచ్చి కౌలు రైతు కాలం పెడతామని, పటేల్, పట్వారీ వ్యవస్థను ప్రవేశపెడతామని చెబుతున్నారు. దీంతో జిల్లా రైతులు కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇబ్బందులు పెట్టేందుకు పాత విధానాలు తేవాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని అంటున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలపై రైతులు బహిరంగంగానే విమర్శలకు
దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సదరు పార్టీ నాయకులకు తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
పాత విధానానికి సంబంధించిన కౌలుదారు చట్టం తీసుకొచ్చేందుకే కాంగ్రెస్ నాయకులు పన్నాగం పండుతున్నట్లు ఉంది. అనేక సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకవచ్చిన ధరణీ పరిష్కారం చూపింది. ఇప్పుడు గ్రామాలలో సన్నా,చిన్నాకారు రైతులందరు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నారు. అందరి భూములకు ధరణీ రక్షణ కవచంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో మళ్లీ పాత పద్దతి తీసుకరావడం అంటే గొడవలు సృష్టించేందకు అర్థం అవుతుంది. ఇప్పటికై కాంగ్రేస్ నాయకులు రైతుల ఆలోచనలు పరిగణంలోకి తీసుకోవాలి. లేకపోతే వచ్చే ఎన్నికలలో సరైన రీతిలో బుద్ది చెబుతారు.
ధరణితోనే మా భూములు మాకు ఎలాంటి పైరవీకారులు లేకుండా పుస్తకాలు వచ్చాయి. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. కానీ.. నేడు అలాంటిదేమీ లేకుండా పైరవీకారుల లేకుండా భూములు ఎక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు పాస్పుస్తకాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. పేద, సన్నకారు రైతులకు లాభం జరిగింది. పేదల భూముల విషయంలో ధరణి రావడంతో కష్టాలు తీరాయి. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తాం అంటున్నది. అదే జరిగితే మళ్లీ పైరవీకార్ల వ్యవస్థ వస్తుంది.
తెలంగాణలో భూములకు చట్టబద్ధత కల్పించి ధరణి పోర్టల్ ద్వారా ప్రతి రైతు భూమిని కాపాడుకునే విధంగా సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసివేస్తే తెలంగాణ రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. రైతుల భూములకు ధరణి ద్వారానే విలువ పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో భూసమస్యలు లేకుండా పోయాయంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో ధరణి పోర్టల్ను ఎత్తివేస్తామని చెప్పే మాటలను ఏ ఒక్క రైతు కూడా నమ్మే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఏర్పాటు చేసుకున్న ధరణి పోర్టల్ రైతుల పాలిట వరం.
ధరణి స్థానంలో కాంగ్రెస్ నాయకులు భూమాత పోర్టల్ తీసుకొస్తామని ప్రకటన చేయడం ఆందోళనగా ఉంది. మళ్లీ పాత రోజులు వస్తాయే మో.. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందే మోనని రైతులు ఆలోచనలో పడ్డారు. ధరణి పోర్టల్ విధానం వల్ల మా రికార్డులు భ ద్రంగా ఉన్నాయి. భూమాత పోర్టల్ పేరుతో కౌలు, అ నుభవదారుల కాలమ్స్ ఏర్పాటు చేసి రికార్డులు తారు మారు చేస్తారేమోనని భయంగా ఉంది. తెలంగాణ ప్రభు త్వం తెచ్చిన ధరణి పోర్టల్ మా భూములకు శ్రీరామరక్ష.
మా కుటుంబానికి వ్యవసా యమే జీవనాధారం. మాకు ఐదెకరాల వ్యవ సాయ భూమి ఉంది. ధరణి పోర్టల్ రాకముందు రెవెన్యూ రికార్డుల్లో వారసత్వ భూమికి పట్టాలిచ్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళారీ వ్యవస్థ కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ ద్వారా నాకు అన్ని రకాల భూమి హక్కు పత్రాలు లభించాయి. గతంలో ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీసేవలో అన్ని రకాల పత్రాలు లభించడంతో ఆనందంగా ఉంది. ధరణి పోర్టల్నే కొనసాగించాలని కోరుకుంటున్నా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తోనే నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది.
ధరణి పోర్టల్ను తీసివేసి దాని స్థానంలో కాంగ్రెస్ భూమాత పోర్టల్ ప్రవేశపెడతామని చెప్పడం రైతులను ఏమార్చడమే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ రావడంతో రైతులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంది. రిజిస్ట్రేషన్లు సైతం తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. భూమాత పోర్టల్ను తీసుకొస్తామన్న కాంగ్రెస్ నాయకులకు రైతులే బుద్ధి చెప్పాలి. భూమాత పోర్టల్ ద్వారా భూములు కౌలు రైతుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమాత పోర్టల్ వద్దని ముక్తకంఠంతో రైతులు చెబుతున్నారు.
తెలంగాణ రాకముందు నాకున్న వ్యవసాయ భూమి అంతా దస్తావేజులమీదే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నా పొలమంతా రికార్డులకు ఎక్కించి పాస్బుక్ ఇచ్చారు. రైతుబంధు కూడా అందుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అన్నివిధాలా సంతోషంగా ఉంది. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే రైతులకు బాధలు తప్పుతాయి.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రైతులకు మేలు జరిగింది. ప్రతి రైతులకు భూహక్కులు సక్రమించాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పహాణీ పొంది ఉపయోగించుకోవచ్చు. గంటల్లోనే భూమి రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. తేలికగా భూమి బదిలీ జరుగుతుంది. దళారుల ప్రమేయం ఉండదు. రైతు ప్రమేయం లేకుండా భూమి అతడి పేరు నుంచి మార్పు చేయడం ఎవరితరం కాదు. అలాంటి ధరణిని రద్దు చేసి పాత పద్ధతి పెడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వొద్దు. ధరణి ఉండాలంటే బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి.
కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటుంది. ధరణి రైద్దెతే దళారులకు మళ్లీ అవకాశం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పాలనలో పహాణీ పద్ధతిలో వీఆర్వోల చేతివాటంతో పూటకొకరి పేరున భూమి ఎక్కేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మధ్యవర్తుల పేరు తొలిగించి నేరుగా భూ యజమానికి పట్టాదారుగా అవకాశం ఇచ్చింది. రైతు వేలిముద్రతోనే భూమి బదిలీ జరుగుతున్నది. ఇలాంటి ధరణి రద్దు అయితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందుకని కాంగ్రెస్ నాయకుల మాటలు నమొద్దు.. వారిని రానీయొద్దు.