అశ్వారావుపేట, జవనరి 19/ఖమ్మం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలోని సర్కార్ బడుల్లో ఈనెల 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మండలాల స్థాయిలో ఎంఈవోలు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,436 బడులు, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 1,232 పైగా బడుల్లో పకడ్బందీగా మూజువాణి పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పద్ధతి అమలుకాని పక్షంలో అధికారులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన తేదీన ఎన్నిక నిర్వహించడం సాధ్యం కానీ పక్షంలో కమిటీ మరో తేదీని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎన్నికపై శనివారం ఉదయం 10 గంటలకు ప్రతి పాఠశాల యాజమాన్యం నోటీస్ బోర్డులో నోటిఫికేషన్ ప్రతిని ప్రచురిస్తుంది. అలాగే ఓటైర్లెన విద్యార్థుల తల్లిదండ్రుల జాబితాను ప్రదర్శిస్తుంది. జాబితాపై అధికారులు 22, 23వ తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి 24న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఎన్నికైన కమిటీ రెండు సంవత్సరాలు పాఠశాల నిర్వహణ, విద్యాహక్కు చట్టం అమలు, బాలల హక్కుల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు ఉభయ జిల్లాల డీఈవోలు సోమశేఖరశర్మ, వెంకటేశ్వరాచారి శుక్రవారం ఎంఈవోలు, హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
విద్యాశాఖలో పనిచేస్తున్న సెక్టోరల్ అధికారులకు విద్యాశాఖ ఎస్ఎంసీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఖమ్మం జిల్లాలో సెక్టోరల్ అధికారులు కే రవికుమార్, భానుప్రసాద్, రాజశేఖర్, రామకృష్ణ నూతన కమిటీలను ఎన్నుకునే ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. అలాగే భద్రాద్రి జిల్లాలో నియమితులైన సెక్టోరల్ అధికారులు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఎన్నికలో ఎక్స్ మెంబర్ మెంబర్గా హెడ్ మాస్టర్, అదనపు మెంబర్గా మరో ఉపాధ్యాయుడిని ఎంఈవో నామినేట్ చేస్తారు. వీరితో పాటు మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్, న గర పంచాయతీ నుంచి లేదా గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్, పాఠశాల సమీపంలోని అంగన్వాడీ టీచర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మహిళా సమాఖ్య సభ్యురాలు సభ్యులుగా నియమితులవుతారు. కమిటీలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల్లో ఒకరిని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిని నియమించవచ్చు. రెండేళ్లలో డ్రాపౌట్ అయిన వి ద్యార్థుల తల్లిదండ్రుల స్థానంలో మరో సభ్యుడిని ఎన్నుకోవాలి.