జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 26 : క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్ పో టీలను ఎంపీ ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంత రం జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు జడ్చర్లలో నిర్వహిస్తుండడం ఎంతో సంతోషకరమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణగా వ్యవహరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి మొత్తం 160 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీ లు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి భ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జడ్చర్లలోని మినీస్టేడియం, జెడ్పీహైస్కూల్ మైదానాల్లో వేర్వేరుగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. మొదటి రోజు వరంగల్పై మహబూబ్నగర్ జట్టు, నిజామాబాద్పై నల్లగొండ, వరంగల్పై హైదరాబాద్, కరీంనగర్పై ఖమ్మం, మెదక్పై రంగారెడ్డి, ఆదిలాబాద్పై ఖమ్మం జట్లు విజయం సాధించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఎంఈవో మంజులాదేవి, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, సతీశ్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్బాబు, పీడీ శారదాబాయి, పీఈటీలు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.