బోనకల్లు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రూ.5 లక్షల యూనిట్ కోసం గురువారం లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మండలానికి ప్రభుత్వం రెండు యూనిట్లు మంజూరు చేసింది. వీటి కోసం మండలంలోని 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిని లాటరీ పద్ధతి ద్వారా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకు మేనేజర్ల సమక్షంలో ఎంపిక చేశారు.
గోవిందాపురం-ఎల్ గ్రామానికి వెంగళ సుందర్రావు, పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన కోట క్రాంతికుమార్లు లాటరీ పద్ధతిలో ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకనాల సౌభాగ్యం, ఎంపీడీవో జీ.శ్రీదేవి ఎంపీవో శ్రీనివాసరెడ్డి, ఎస్బీఐ, ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.