కల్లూరు, డిసెంబర్ 1: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకూ శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు రూ.1,00,116ను సాయంగా అందించి వారికి ఆర్థిక భరోసానిస్తున్నారని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి బృహత్తర పథకాలు తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. కల్లూరులోని శాంతినగర్, గోపాలకుంట ప్రాంతాల్లో గురువారం పర్యటించిన ఆయన.. నాయకులతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరి 42 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాలెపు రామారావు, బీరవల్లి రఘు, అజయ్బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, దార్ల నర్సింహారావు, ఎస్కే కమ్లీ, ఉబ్బన వెంకటరత్నం, ఖమ్మంపాటి రమేశ్, కంభంపాటి వెంకటేశ్వర్లు, పుల్లారావు పాల్గొన్నారు.