పెనుబల్లి/ సత్తుపల్లి, జూన్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరిస్తున్న ఆధ్యాత్మిక చింతనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్లనే రాష్ట్రంలో సర్వమత సమ్మేళనం విలసిల్లుతోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా పెనుబల్లి మండలంలో బుధవారం ఆయన ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన నీలాద్రీశ్వర ఆలయంలో హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ యాపిల్ సర్వేలో దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక చింతన కలిగిన రాష్ట్రం తెలంగాణ అని తేలిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండితులకు వేతనాలు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ పేరుగాంచిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, రమణ, వెంకట్రావు, ప్రసాద్, నిరంజన్గౌడ్, తావునాయక్, రాంబాబు, రుద్రజరాణి, శ్రీను, చెన్నారావు, చంద్రరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అన్ని మతాలకూ సమాన గౌరవం..
దేశంలో అన్ని మతాలకూ సమాన గౌరవం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలోని పలు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ఆయన ప్రత్యేక పూజలు, నమాజులు, ప్రార్థనలు చేశారు. బతుకమ్మ చీరెలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు.. అన్ని మతాల ప్రజలూ అండగా ఉంటారని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మహేశ్, వనమా వాసు, రఫీ, చాంద్పాషా, షరీఫ్, రియాజ్, గఫార్, శ్రీను, వరప్రసాద్, అంకమరాజు, ఆనందరావు, కాంతారావు, పురుషోత్తం పాల్గొన్నారు.