పెనుబల్లి, జూన్ 9: సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ర్టానికి స్వర్ణయుగమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ సంక్షేమ లబ్ధిదారులతో పెనుబల్లి ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన మాట్లాడారు. రూ.లక్షల కోట్లు వెచ్చించి ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.
నియోజకవర్గంలో మూడేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇంతటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడలేని కబోధులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు విద్యాచందన, రమాదేవి, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, భానుచౌదరి, కావూరి మహాలక్ష్మి, కొనగాల వెంకట్రావు, మందడపు అశోక్కుమార్, ముక్కర గోపాలరెడ్డి, చెక్కిలాల లక్ష్మణరావు, తేజావత్ తావునాయక్, చీపు లక్ష్మీకాంతం, లక్కినేని వినీల్, కోటగిరి సుధాకర్బాబు, భుక్యా ప్రసాద్, కర్ణాటి వీరభద్రారెడ్డి, కోమటి ప్రసాద్, లగడపాటి శ్రీను, దొడ్డపునేని శ్రీదేవి, తడికమల్ల తాతారావు, కోట ప్రభాకర్, గువ్వల వెంకటరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.