వేంసూరు: ఐకేపీ, సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సొసైటీ ఛైర్మన్లకు సూచించారు. శుక్రవారం మండలపరిధిలోని కందుకూరు గ్రామంలో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్, నాయకులతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటను సొసైటీ, ఐకేపీల ద్వారా కొనుగోలు చేసే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తేమ శాతం చూసి కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి, నాయకులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, రాయల సత్యం తదితరులు పాల్గొన్నారు.