వేంసూరు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించారు. మర్లపాడు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గండ్ర బాబురెడ్డి తనయుడు శరత్ కుమార్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, లచ్చన్నగూడెం సొసైటీ ఛైర్మన్ గండ్ర సోమిరెడ్డి, సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ రాఘవరెడ్డి, గొర్ల రామ్మోహన్ రెడ్డి తదితరులున్నారు.