ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఎయిడెడ్లోని విద్యార్థులు ఈ ఎస్ఏ-1 పరీక్షలను నిర్వహించాలని డీఈఓ యాదయ్య, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ నెల 14వ తేది నుంచి ఈ నెల 20వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం పేపర్-1, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు.
1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 6వ, 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.15గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.45గంటల వరకు పరీక్ష జరగనుంది.