ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొదటి మూడు రోజులు అన్ని గ్రామాలలో విద్యార్థులకు రైతుబందు పథకంపై పలు పోటీలు నిర్వహించారు. రైతుబంధు సమితి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు, వ్యవసాయ అనుబంధశాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూనే, సీఎం కేసీఆర్కు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సైతం అదే జోరుహోరు కనిపించింది.