ఖమ్మం : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనులను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని జడ్పీ సిఈవో వింజం వెంకటప్పారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రేగులచలక గ్రామంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ముందుగా గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి పల్లెప్రగతి యాప్ను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని, హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్లు కొర్లపాటి రామారావు, మాదంశెట్టి హరిప్రసాద్, ఉపసర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంగీత, గ్రామ పెద్దలు నున్నా శ్రీనివాసరావు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.