ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సిన్ వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 35 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సిద్ధంగా ఉందని, అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లకు, సిబ్బందికి టీకా వేయించే విధంగా ఆర్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు.
కొవిడ్ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుండటంతో ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ఆర్వీ కర్ణన్, డీహెచ్ఎమ్వో మాలతి ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి