ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువతగా ఉండి ఇప్పటికే ఎంప్లాయిమెంట్ కార్డు పొంది వివిధ కారణాలతో రెన్యువల్ చేసుకోలేక పోయిన వారు తమ ఎంప్లాయిమెంట్ కార్డును పునరుద్దరించు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిదని జిల్లా ఉపాధికల్పానాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2021 మే10తేదీ నాటికి 45 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
రెన్యువల్ చేసుకునే అభ్యర్థులు తమ ఎంప్లాయిమెంట్ కార్డు, కులము, ఆధార్, విద్యార్హత ఒరిజనల్ సర్టిఫికేట్స్తో ఆన్లైన్ ద్వారా ఎంప్లాయిమెంట్ ఫోర్టల్లో రెన్యువల్ రిస్టోరేషన్ ఆప్షన్లో 31 డిసెంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.