పూణె, ఆగస్టు 7: బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్కు నయా పల్సర్ను పరిచయం చేసింది. పల్సర్ను విడుదలై 25 ఏండ్లు పూర్తైన సందర్భంగా పల్సర్ ఎన్160 ఎస్, ఎన్160 ఎస్ఎస్ మాడళ్లను తీసుకొచ్చింది. వీటిలో ఎన్160 ఎస్ ధర రూ.1,33,511గా, ఎన్160 ఎస్ఎస్ ధరను రూ.1,42,585గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం 4.5 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ బైకులో గూగుల్ మ్యాప్ మిర్రరింగ్తో కూడిన 5 టీఎఫ్టీ ఉన్నది. ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్న తొలి దేశీయ స్పోర్ట్స్ బైకు ఇదే కావడం విశేషం.