ఖమ్మం : ఖమ్మం విజయ డెయిరీ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రవికుమార్ నియమితులయ్యారు. ఇక్కడ డీడీగా విధులు నిర్వహించిన ఆర్.భరతలక్ష్మి హైదరాబాద్ ఎంపీఎఫ్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో మెదక్లో డీడీగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ఖమ్మం విజయ డెయిరీ డీడీగా ఇంచార్జ్ బాధ్యతలను స్వీకరించారు. రవికుమార్ గతంలో ఖమ్మం మేనేజర్గా,ఇంచార్జ్ డీడీగా దీర్ఘకాలం పని చేశారు.
డీడీగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ను కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది గజమాలతో సత్కరించి, పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.