ఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, అజీజ్ గల్లీ తదితర ప్రాంతాలు రంజాన్ వస్తువుల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన వస్ర్తాలు, వివిధ రకాల సేమియా ప్యాకెట్లు, సెంటు సీసాలు, ఫ్యాన్సీ ఐటెమ్స్, చెప్పులు ఇలా తీరొక్క వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయా ప్రాంతాల్లో కాలుతీసి కాలు వేయలేని పరిస్థితి నెలకొన్నది. ఒకరోజు ముందే రంజాన్ వచ్చినట్లుగా సందడి కనిపించింది.