పర్ణశాల, మార్చి 19 : పునర్వసు నక్షత్రం సందర్భంగా పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం అర్చకులు పునర్వసు కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. కల్యాణ క్రతువు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యంత్రధారణ, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, మహా సంకల్ప మంగళాష్టకాలు, మధుపర్కాలు, జీలకర్ర బెల్లం సమర్పణ, మాంగల్యాధారణ పూజ, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలను అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. కార్యక్రమంలో ముఖ్య అర్చకుడు కిరణ్కుమారాచార్యులు, వెంకట్రామాచార్యులు, ఆలయ ఇంఛార్జి ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.