సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ వస్తున్నదని, 60 ఏళ్లు పాలిస్తే ఆరు గ్యారెంటీలెందుకని, అలాంటి మోసగాళ్ల పార్టీని నమ్మొద్దని ఖమ్మం ఎంపీ, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన సత్తుపల్లి, వేంసూరు మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల అకౌంట్లలో రైతుబంధు పథకం కింద రూ.73వేల కోట్లు వేసి దేశంలోనే చరిత్ర సృష్టించారని చెప్పారు. అబద్ధాలు చెప్పే రాహుల్గాంధీ మాటలను నమ్మొద్దన్నారు. పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఊరూరా వివరించి మళ్లీ అభివృద్ధి పరిచే తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. నవంబర్ ఒకటో తేదీన కల్లూరులో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చెందిన తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తన సొంత ప్రాంతమైన సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నందునే తాను బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకు రూ.60కోట్ల వ్యాపారం చేసే నేను వ్యాపారాన్ని ఎన్నికలయ్యేంతవరకు పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు పారాలంటే మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
నవంబర్ ఒకటో తేదీన కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరగనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. రానున్న దసరా పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సత్తుపల్లి, వేంసూరు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, గొర్ల సంజీవరెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, గ్రామశాఖల అధ్యక్షులు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్పాషా, నడ్డి ఆనందరావు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
వైరా టౌన్, అక్టోబర్ 19: వైరాలో బీఆర్ఎస్ సీటును గెలిపించుకుని గులాబీ జెండా ఎగురవేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు (దిద్దిపూడి)లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్లాల్ను ప్రజలు మద్దతు ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిందని, నాయకులు సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. పార్టీ గెలుపు కోసం రేయింబవళ్లు కలిసి మెలసి శ్రమించాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను వైరా ఎమ్మెల్యే రాములునాయక్ దేవుడిగా భావిస్తారని, ఆయన ఆజ్ఞను ఎమ్మెల్యే శిరసావహిస్తారన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బానోతు మదన్లాల్ను గెలిపించేందుకు పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల తర్వాత తాను ప్రత్యేక చొరవ తీసుకుని నియోజకవర్గంలో జాబ్మేళాలు నిర్వహిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములునాయక్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ వైరా మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, నాయకులు కట్టా కృష్ణార్జున్రావు, కాపా మురళీకృష్ణ, డేరంగుల బ్రహ్మం, షేక్ లాల్మహ్మద్, అయిలూరి మహేశ్రెడ్డి పాల్గొన్నారు.