ఖమ్మం, జనవరి 8: సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ జీఎంఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన ‘వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 7వ జిల్లా క్యాబినేట్ 2023’, జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కోటి రూపాయలు ఇచ్చైనా ఆర్యవైశ్యులతో సోపతి చేయమని సీఎం కేసీఆర్ అంటూంటారన్నారు. ఆర్యవైశ్యులకు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని గుర్తింపు సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. ఉప్పల్ బగాయత్లో ఆర్యవైశ్య భవన్కు ఐదెకరాల భూమిని ఇచ్చారన్నారు. రాజకీయంగానూ ఆర్యవైశ్యలకు పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. 75 ఏండ్ల చరిత్రలో ఆర్యవైశ్యులకు రాని గుర్తింపు స్వరాష్ట్రం వచ్చిన ఎనిమిదేళ్లలోనే వచ్చిందన్నారు. ఆర్యవైశ్యుల్లో నలుగురికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 11 మందికి మున్సిపల్ చైర్మన్, ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎమ్మెల్యేలు పదవులు వచ్చాయన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ కూడా ఆర్యవైశ్యుడేనన్నారు. ఆర్యవైశ్యులకు ఏ పదవులు ఇచ్చినా వారు నీతి నిజాయతీతో పనిచేస్తారన్నారు. ఆర్యవైశ్యులు అన్ని కులాలు, వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉంటారన్నారు. వారు ఏర్పాటు చేసిన రైస్మిల్లులు, కిరాణ, వస్త్ర దుకాణాల్లో వేలాది మంది ఉపాధి పొందుతారన్నారు. ఏ ఊర్లోనైనా బడి నిర్మించాలన్నా, గుడి నిర్మించాలన్నా అందులో ఆర్యవైశ్యుల సాయం ఉంటుందన్నారు. అన్నదానాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారన్నారు. కరోనా సమయంలో బయటకు వచ్చి నిరుపేదలకు సాయం అందించారన్నారు. వాసవి క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. ఐవీఎప్ సంస్థ ఐఏఎస్ ప్రిలిమినరీ సాధించిన ఐఏఎస్ అభ్యర్థులు 23 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పంటలకు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. కార్యక్రమంలో క్యాబినేట్ వీఎన్ క్రౌన్ కేసీజీఎఫ్ యాద నాగేశ్వరరావు, పీఐఎన్పీ వీఎన్ డైమండ్ కేసీజీఎఫ్ పాలకుర్తి గాయత్రి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆఫీసర్ వీఎన్, గోల్డెన్ కేసీజీఎఫ్ దోసపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గవర్నర్ వీ106ఏ విన్ సిల్వర్ కేసీజీఎఫ్ దార మల్లికార్జునరావు, క్యాబినెట్ సెక్రటరీ, వీఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ దార నరసింహారావు, క్యాబినెట్ కోశాధికారి, వైస్ గవర్నర్ గోల్డెన్ కేసీజీఎఫ్ వాసవి గుమ్మడవెల్లి శ్రీనివాస్, వీన్సీజీఎఫ్ దోసపాటి లక్ష్మి, ఉప్పల శారద ప్రెసిడెంట్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్జాల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్, ఇతర నాయకులు గంగిశెట్టి జగదీశ్ కుమార్, లింగయ్య, శ్రీనివాస్, హన్మంతరావు, శివకుమార్, సుజాత, కృష్ణమూర్తి, జగన్ మో హన్రావు, వేణుగోపాల్, రాధాకృష్ణ, జగన్నాథం, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్స్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.