సారపాక, జూన్ 13: బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడించిన వివరాలు.. ఐటీసీ పీఎస్పీడీలో కాం ట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న సారపాక గ్రామస్తుడు స య్యద్ రఫీకి భార్య సయ్యద్ జీనత్ పర్వీన్, కుమారుడు స య్యద్ రిషిద్ (మైనర్), కూతురు ఉన్నారు. తొమ్మిదోతరగతి చదువుతున్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. తండ్రి మందలిస్తున్నా కూడా లెక్కచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీనిని సహించలేని ఆ తండ్రి.. ఒక రోజున తన కొడుకును కొట్టాడు. అప్పటి నుంచి ఆ తండ్రిపై ఆ పిల్లాడు పగ పెంచుకున్నాడు. అతడికి తల్లి జీనత్ పర్వీన్ మద్దతుగా నిలిచింది. ఆమెకు ఆరు నెలల క్రితం మండలంలోని నకిరిపేట గ్రామస్తుడు కొర్రా జంపన్నతో పరిచయం ఏర్పడింది. అది క్రమేణా స్నేహంగా, వివాహేతర సంబంధంగా మారింది. అతడు రఫీతో స్నేహపూర్వకంగా ఉంటూ తరచూ ఆ ఇంటికి వస్తున్నాడు. రఫీ, జంపన్న కలిసి ఆ (రఫీ) ఇంట్లోనే మద్యం తాగుతుండేవారు.
రఫీ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లినప్పుడల్లా అతడి ఇం టికి జంపన్న వచ్చేవాడు. తండ్రిపై పగ పెంచుకున్న కుమారుడు కూడా ఈ విషయాన్ని దాచాడు. ఇదంతా ఆలస్యంగా తెలుసుకున్న రఫీ.. తన భార్యను, కొడుకును తీవ్రంగా మందలించా డు. ఇంట్లో ఇలా జరిగిందంటూ జంపన్నతో పర్వీన్ చెప్పింది. తమ మధ్య అడ్డుగా ఉన్న రఫీని చంపేయాలని పర్వీన్ను జంపన్న రెచ్చగొట్టాడు. మూడు నెలల క్రితం జంపన్న ఏవో మాత్రలు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు. రఫీ భార్య, కొడుకు కలిసి వాటిని జ్యూస్లో కలిపి అతడికి ఇచ్చారు. కానీ, రఫీకి ఏమీ కాలేదు. ఈ నెల 9వ తేదీ రాత్రి ఇంట్లోనే గాఢ నిద్రలో ఉన్న రఫీని చంపేందుకు పథకం వేశారు. ఆ రోజున.. రఫీ కాళ్లను పర్వీన్ గట్టిగా పట్టుకుంది. ఇంట్లో ఉన్న సుత్తితో తండ్రి తలపై కొడుకు రిషీద్ గట్టిగా మోదాడు. రఫీ ప్రాణాలొదిలాడు. సుత్తిని, రక్తం అంటిన బట్టలను మోతే, ఇరవెండి గ్రా మాల మధ్యన అటవీ ప్రాంతంలో పడేశారు. పోలీసుల వి చారణలో ఈ వివరాలన్నీ తల్లీకొడుకు పర్వీన్, రిషీద్ బయటపెట్టారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు అప్పగిస్తామని సీఐ చెప్పారు. ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.