భద్రాద్రి కొత్తగూడెం, జూలై 2 (నమస్తే తెలంగాణ): పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లాలోని పినపాక, అశ్వాపురం, బూర్గంపహాడ్, టేకులపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పోడు రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
జిల్లావ్యాప్తంగా 50,595 మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగారాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గత నెల 30న పాల్వంచ పట్టణానికి విచ్చేసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి 2,500 మందికి పట్టాలు పంపిణీ చేశారు. టేకులపల్లి మండలంలో ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పట్టాల పంపిణీని షురూ చేశారు. సోమవారం నుంచి ఆయా నియోజకవర్గాల మిగిలిన ఎమ్మెల్యేలూ పోడు రైతులకు పట్టాలు అందించనున్నారు.