తిరుమలయపాలెం, మే 20 : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండి పడమట తండా వరకు, నేషనల్ హైవే రోడ్డు నుండి తేట్టలపాడు వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్లు తొలగించి రెడ్మిక్స్ పరిచి గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై కాంట్రాక్టర్లు కక్కుర్తి బుద్ధితో సక్రమంగా వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వల్ల రోడ్లపై పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు దుబ్బా దూళి లేచి వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు కళ్లలోకి దుబ్బాదూళి వెళ్లి చిన్న చిన్న ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని నిర్మాణంలో ఉన్న రోడ్లపై సక్రమంగా వాటర్ క్యూరింగ్ చేయించాలని కోరుతున్నారు.

రహదారి పనుల్లో వాటర్ క్యూరింగ్ లేమి.. వాహనదారుల ఇబ్బందులు