కూసుమంచి రూరల్, అక్టోబర్ 7: బీఆర్ఎస్ పాలనలోనే మారుమూల గిరిజన తండాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న పంచాయతీలకూ అద్భుతంగా మౌలిక సదుపాయాలు సమకూరాయని అన్నారు. కూసుమంచి మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. లింగారాంతండాలో రూ.2.60 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు.
లింగారాంతండా – గన్యాతండా మధ్య రూ.90 లక్షలతో, లింగారాంతండా – గట్టుసింగారం మధ్య రూ.1.70 కోట్లతో రెండు బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు మొదలుపెడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో తనకు అధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బానోత్ శ్రీనివాస్, ఇంటూరి శేఖర్రావు, వేముల వీరయ్య, ఆసిఫ్పాషా, నాగేశ్వరరావు, చాట్ల పరుశురామ్, షేక్ అలీ, వాకా సుధారాణి, వడ్త్యా బాలకృష్ణ, రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి మండలంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే కందాళ.. పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చెన్నారం – జక్కేపల్లి మధ్య రూ.2.70 కోట్లతో, భైరాగులగుట్ట – కొత్తకొత్తూరు మధ్య రూ.1.40 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణాలకు శంకస్థాపన చేసారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొంగర గ్రామంలో రూ.70 లక్షలు, మంగాపురంతండాలో రూ.35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు, చెరువుమాధారంలో రూ.25 లక్షలతో నిర్మించే కాజ్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
చెరువుమాధారం క్రాస్ రోడ్డులో తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్మించిన జెండా దిమ్మెను ప్రారంభించి జెండాను ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు మరికంటి ధనలక్ష్మి, వజ్జా రమ్య, శీలం వెంకటలక్ష్మి, ఉన్నం బ్రహ్మయ్య, గండు సతీశ్, రాయపూడి నవీన్, మస్తాన్, మాగి పుల్లయ్య, భూక్యా సుధాకర్, యెన్నబోయిన శ్రీను, నంబూరి సత్యనారాయణ, పగిడిపత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.