ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కందాళ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ,చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణతో మాట్లాడి సమస్యను వివరించడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన సోమేశ్ కుమార్ వారం రోజులలోపు పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఉద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు.