అశ్వారావుపేట, అక్టోబర్ 11 : మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాగునీటి సరఫరాలో పైపు లైన్ల లీకేజీలకు గుర్తించి వెంటనే రిపేర్ చేయాలని చెప్పారు. ఇంటింటికీ శుద్ది చేసిన సురక్షిత తాగునీరు ప్రజలకు అందించడమే మిషన్ భగీరథ పథకం ముఖ్యఉద్ధేశమని చెప్పారు. అధికారుల పర్యవేక్షణ క్షేత్ర స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఈ తిరుమలేశ్, డీఈ సయ్యద్ సలీమ్, నియోజకవర్గ మండలాల ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.