భద్రాచలం, మే 17: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామవారి ఉపాలలయమైన శ్రీయోగానంద లక్ష్మీ నృసింహా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహ స్వామివారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా రథాంగ హోమం నిర్వహించారు. గోదావరి పుణ్యజలాలను రథంపై సంప్రోక్షించారు. అనంతరం నృసింహా స్వామివారిని రథంలో ఉంచి తాతగుడి సెంటర్ వరకు రథోత్సవం జరిపారు.
ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రథాన్ని లాగారు. రహదారులకు ఇరువైపులా వేచి ఉన్న భక్తులు నృసింహ స్వామివారిని రథంలో చూడగానే జయజయధ్వానాలు చేశారు. హారతులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు.నేడు సదస్యం, తెప్పోత్సవం నృసింహ స్వామివారికి బుధవారం సదస్యం నిర్వహించనున్నారు. సాయంత్రం నృసింహ స్వామివారిని పవిత్ర గోదావరిలో తెప్పోత్సవం, అనంతంర దొంగలదోపు ఉత్సవం జరుపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.