కీసర: ఉపాధిహామీ కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గోధుమకుంట గ్రామంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల రికార్డులను అప్డెట్ చేస్తున్నారు. ఆయా పనులను ఎంపీడీవో పద్మావతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధిహామీ పనులకు సంబంధించి సెంట్రల్ టీం విజిట్ చేస్తారని, అందులో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనుల రికార్డుల్లో తప్పులు లేకుండా సరిచేసుకోవడానికి రికార్డులను అప్డెట్స్ చేసుకోవాలన్నారు. రికార్డులో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బంది పైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుభాషిణి, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.