ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. తనకు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.