గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం నగరంలోని ఐటీ హబ్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు.
– ఖమ్మం, జూన్ 6
ఖమ్మం, జూన్ 6 : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొనసాగుతోందని, దేశంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానం కైవసం చేసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం నగరంలోని ఐటీ హబ్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణలోని పరిశ్రమలకు నీళ్లు, కరెంటు లేక పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఉండేవని అన్నారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వం కల్పించిన వనరులతో పారిశ్రామికవేత్తలందరూ తమ పరిశ్రమలను విజయవంతంగా నడుపుతున్నారని అన్నారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలంటే వివిధ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టీఎస్-ఐపాస్ ద్వారా 21 రోజుల్లోనే అన్ని అనుమతులూ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 9 ఏళ్లలోనే 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఒకప్పుడు వారంలో కేవలం 4 రోజులు పరిశ్రమలు నడుపుకుని మిగతా మూడు రోజులు పవర్ హాలీడే ప్రకటించిన అంశం ప్రజలందరికీ గుర్తేనని అన్నారు. గ్రానైట్ పరిశ్రమను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మధ్యే దావోస్ పారిశ్రామిక సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. రూ.30 వేల కోట్ల పెట్టుబడులను రాష్ర్టానికి తీసుకొచ్చారని, ఆయా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మరో 40 వేల నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని వివరించారు.
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు. పరిశ్రమల ప్రోత్సాహంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచిన జిల్లా ఖమ్మమేనని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం గొప్ప విజయాలు సాధించిందని అన్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా 1,009 మంది ఎస్సీలకు రూ.67 కోట్లు, 1,166 మంది ఎస్టీలకు రూ.55.80 కోట్ల సబ్సిడీని అందించినట్లు వివరించారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. టీ హబ్ తెలంగాణకు కలికితురాయి అని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. అనంతరం ఉత్తమ పారిశ్రామికవేత్తలకు ప్రసంశా పత్రాలు, మెమెంటోలు అందించి సతరించారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, పరిశ్రమల శాఖ జీఎం అజయ్కుమార్, టీ హబ్ కోఆర్డినేటర్ బత్తిని ప్రకాశ్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల వెంకటరమణ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, వివిధ కంపెనీల సీఈవో, అధికారులు పాల్గొన్నారు.
రిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఎమ్మెల్సీ మధు
పరిశ్రమల స్థాపనను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోందని అన్నారు. రానున్న రోజుల్లో సైతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ, ఖమ్మం అభివృద్ధి చూసి గర్వపడాలని అన్నారు. సింగిల్ విండో ద్వారా అన్ని సౌకర్యాలనూ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు.