రామవరం, ఏప్రిల్ 3: కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి ఆడిపాడారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మరోసారి కేసీఆర్ను సీఎం చేసేందుకు కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు కుతంత్రాలు పన్నినా వెనకడుగు వేయబోమని అన్నారు. ఎన్నికల సమయంలో పగటి వేషగాళ్లు వస్తూ పోతూ ఉంటారని విమర్శించారు. అలాంటి వాళ్లను, వారి మాటలను నమ్మవద్దని అన్నారు. పార్టీలో కలహాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును గజమాలతో సత్కరించారు. ఈ సమ్మేళనంలో వనమా రాఘవేందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, నాయకులు కాసుల వెంకట్, ఎంఏ రజాక్, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, వజ్జా రాజు, కౌన్సిలర్లు మోరె రూప, కూరపాటి విజయలక్ష్మి, కోలాపురి ధర్మరాజు, పల్లపు లక్ష్మణ్, వేముల ప్రసాద్, అంబుల వేణు, బండి నరసింహ, మాదా సత్యవతి, కో ఆప్షన్ మెంబర్ దుంపల అనురాధ, ఎంపీటీసీ భూక్యా రుక్మిణి, సంకుబాపన అనుదీప్, గిడ్ల పరంజ్యోతిరావు, న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, పోసాని రాధాకృష్ణ, అడపాల పార్వతి, బీఆర్ఎస్ నాయకులు మోరె భాస్కర్, ఎండీ గౌస్, బాలాజీ నాయక్, అరుణ్, మజీద్, రాజుగౌడ్, హుస్సేన్ పాల్గొన్నారు.