సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసానికి వెళ్లి ప్రభాకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అదేవిధంగా జూపల్లి కంటి ఆసుపత్రి రోడ్లో మలిశెట్టి రామారావు అనారోగ్యంతో మృతిచెందగా ఆయన నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, చాంద్పాషా, అనిల్, గఫార్, కంటే అప్పారావు తదితరులు ఉన్నారు.