పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలు అనుబంధ సంఘాలను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు వివిధ కమిటీల బాధ్యులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వివరించాలని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులకు కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాలని, కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఉంచిన ఘనత కేసీఆర్దేనన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణయ్య, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ సోమరాజు రామప్ప, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మందడపు అశోక్కుమార్, లక్కినేని వినీల్, చింతనిప్పు సత్యనారాయణ, చీకటి రామారావులు పాల్గొన్నారు.