పెనుబల్లి, నవంబర్27: నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని వీఎం బంజరలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఆదివారం బీఆర్ఎస్ నాయకులు వంగా గిరిజాపతి, వంగా రవిశంకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రసాద్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు సండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి సండ్ర గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సండ్ర మా ట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని వినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఉపాధ్యక్షుడు కొత్తగుండ్ల అప్పారావు, నాయకులు వంగా చంద్రశేఖర్, వంగ సురేశ్, వేముల సురేశ్, వేముల బాబురావు, మల్లె ల శ్రీనివాసరావు, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కోట ప్రభాకర్, వారియర్స్ మరీదు చంద్రశేఖర్, మరకాల చంటి, మరకాల వెంకీ పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 27: నన్ను మరోసారి ఆశీర్వదించండి, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధితో ముందుకెళ్దామని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో వీఎం బంజర, పెనుబల్లి గ్రామాలు గులాబిమయమయ్యాయి. వీఎం బంజరలో భూక్యా ప్రసాద్, వంగా గిరిజాపతి, వంగా రవిశంకర్గౌడ్ ఆధ్వర్యంలో, పెనుబల్లిలో నాయకులు కోటగిరి సుధాకర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రోడ్షో వీఎం బంజర రింగ్సెంటర్ మీదుగా పెనుబల్లి శివారు వరకు ద్విచక్ర వాహనాలతో మహార్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానంతో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ పెనుబల్లి, వీఎం బంజర గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ప్రతిఒక్కరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేశానన్నారు. చేసిన పనిని కరపత్రాల ద్వారా ప్రతిఒక్కరికీ తెలియజేసిన ఘనత కూడా నాదే అన్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త శక్తులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.
కానీ అభివృద్ధి పనులు గురించి మాత్రం చెప్పడం లేదని, వారు చేయాల్సిన అభివృద్ధి ఇక్కడ ఏమీ లేదని అర్థమవుతుందన్నా రు. ఎంపీ బండి పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ సండ్రను గెలిపించే బాధ్యత మీది మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త కష్టపడి చేసి ప్రతిఓటు కారు గుర్తుపై వేసేలా చూసి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం అత్యధిక మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలైఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, నాయకులు సోమరాజు శివరామప్రసాద్, కోటగిరి సుధాకర్బాబు, వంగా రవిశంకర్గౌడ్, సర్పంచ్లు తేజావత్ తావునాయక్, భుక్యా పంతులి, మందడపు అశోక్కుమార్, లక్కినేని వినీల్, చెక్కిలాల లక్ష్మణరావు, గోదా చెన్నారావు, వంగా గిరిజాపతి, లగడపాటి శ్రీను, సూరపురెడ్డి కిరణ్రెడ్డి, కోమటి ప్రసాద్, దొడ్డపునేని రవి, పలుగ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, నవంబర్ 27: సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపు కోరుతూ సోమవారం సండ్ర సతీమణి మహాలక్ష్మి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సండ్ర చేసిన అభివృద్ధి, మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటి పంపిణీ చేస్తూ రానున్న ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాత సండ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమె వెంట నాయకులు అద్దంకి అనిల్, మాధురి మధు, గుంజి వెంకటేశ్వరరావు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కల్లూరు, నవంబర్ 27: మండలంలోని పాయపూర్ గ్రామంలో సోమవారం జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్కు చెందిన 50 కుటుంబాలు సండ్ర వెంకటవీరయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరారు. వారికి జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి, నియోజకవర్గంలో సండ్ర చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో సండ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సరాబు వెంకటేశ్వరరావు, ఊటుకూరి రాము, తాళ్లూరు రమేశ్, గోసు వీరభద్రం, వీ శ్రీను, నరసమ్మలతో పాటు సాయి, మహేశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, నవంబర్ 27: సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని 4, 13, 15, 17 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలి.. ముద్రించిన వాల్పోస్టర్లను ఆయన గోడలకు అతించారు. వార్డుల్లో తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి, సండ్రను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చాంద్పాషా, అద్దంకి అనిల్, సుజాతరావు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు వల్లభనేని పవన్, బీఆర్ఎస్ నాయకుడు వీరపనేని బాబీ పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్ 27: మండలంలోని రామానుజవరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం నిర్వహించారు. వైస్ ఎంపీపీ శీలం శివపార్వతి, సర్పంచ్ శీలం కోటారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని బొట్టు పెడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఆశీర్వదించి సండ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శీలం శివపార్వతి, ఉపసర్పంచ్ కిన్నెర జమలయ్య, మాజీ ఎంపీటీసీ పిల్లి కృష్ణయ్య, మాజీ ఉపసర్పంచ్ యన్నం శ్రీనివాసరెడ్డి, వార్డుసభ్యులు బొగ్గుల రామకృష్ణారెడ్డి, కోడూరి సత్యనారాయణ, కోడూరు కృష్ణారావు, శీలం వెంకటరెడ్డి, చింతపట్ల వెంకటి, కిన్నెర కృష్ణ, బొగ్గుల గోపిరెడ్డి, కోటయ్య, కవిత, లక్ష్మి, సూరమ్మ, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్27: మండలంలోని గొల్లగూడెం ఎస్సీకాలనీలో కోడూరు వీరకృష్ణ, ఇస్నేపల్లి వీరయ్య ఆధ్వర్యంలో సండ్ర గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి సండ్రను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొండూరు సుధాకర్, కోడూరి వీరకృష్ణ, ఇస్నేపల్లి వీరయ్య, మాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.