పెనుబల్లి, సెప్టెంబర్ 27: అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు అనేక మాయమాటలు చెబుతుందని, అలవిగానీ హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ గురించి ప్రజలకు తెలుసుగనుకనే ఆ పార్టీ నేతలు ఇచ్చే హామీలను ఎవ్వరూ విశ్వసించడం లేదని అన్నారు. పెనుబల్లి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. సుమారు రూ.10.72 కోట్లతో కొత్త లంకపల్లి, పాత లంకపల్లి, శ్రీనివాసపురం, ఏరుగట్ల, ఉప్పలచెలక, పెరికకుంట, భవన్నపాలెం, నీలాద్రి, లింగగూడెం, పెనుబల్లి, గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, గృహలక్ష్మి ఇళ్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేసి ఆ నీళ్లతో భద్రాద్రి రాముడికి అభిషేకం చేస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపామని, ఇక్కడి కీర్తిని నలుదిశాలా చాటి చెప్పామని అన్నారు. పథకాలు లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, శ్రీనివాస్, ప్రతాప్, కనగాల వెంకట్రావు, భుక్యా ప్రసాద్, మందడపు అశోక్కుమార్, పసుమర్తి వెంకటేశ్వరరావు, చింతనిప్పు సత్యనారాయణ, చెక్కిలాల లక్ష్మణరావు, లక్కినేని వినీల్, చీకటి రామారావు, కోటగిరి సుధాకర్, తాళ్లూరి శేఖర్రావు, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, రావూరి రత్నకుమారి, కర్నాటి వీరభద్రారెడ్డి, కోమటి ప్రసాద్, తడికమల్ల తాతారావు, కాకాటి ప్రకాశ్, కొంగా సురేష్, తేజావత్ తావునాయక్, కొలగొర్ల జనార్దన్, బొర్రా వెంకటేశ్వర్లు, షేక్ గౌస్, చోడే రాంబాబు, కర్రి మోహన్ తదితరులు పాల్గొన్నారు.