సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, జ్యేష్ట లక్ష్మణరావు, పవన్, రమేష్రెడ్డి, రావి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.