తల్లాడ :ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం లబ్ధిదారులకు అందించారు. తల్లాడకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 5 లక్షలు 66 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఈ ఏడాది మొత్తం 5 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లుపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, మండల నాయకులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, దూపాటి నరేష్, దగ్గుల రాజశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.