లక్నో : ఉత్తర ప్రదేశ్లోని బలియాలో ఓ మైనర్ బాలుడికి పోక్సో కోర్టు 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2023 జూలై 15న ఉదయం పఖ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
అదే సమయంలో దేవరియా జిల్లాలోని సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన మైనర్ బాలుడు ఆమెను మాయ మాటలతో ఆకర్షించి అపహరించాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు బాలుడికి 15 ఏండ్లు వచ్చేదాకా గాజీపూర్లోని ప్రత్యేక బాలల గృహంలో ఉంచి చదువుకు సంబంధించిన ఏర్పాట్లను కల్పించాలని.. ఆ తర్వాత అతడిని మౌ జిల్లా జైలుకు తరలించి మిగిలిన శిక్షను అనుభవించేలా చేయాలని ఆదేశించింది.