న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయం పూర్తి పాఠం ఆలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. జాతీయ గేయం పూర్తిగా ఆలపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని బీజేపీ ఆరోపించగా ప్రతిపక్ష కాంగ్రెస్ దీన్ని ఖండించింది.
ఓ వీడియోను బీజేపీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ వందేమాతరం గేయాలాపన సమయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రశ్నించారని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించే సమయంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరగలేదని స్పష్టం చేసింది.
చాలా సేపటి నుంచి నిలబడి ఉన్న పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూర్చునేందుకు ఒక కుర్చీ తీసుకురావాలని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని ఆ పార్టీ వివరించింది. తమ పార్టీ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని పూర్తి పాఠాన్ని ఆలపించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు.