కారేపల్లి, ఏప్రిల్ 3: తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి దుష్టశక్తులకు గ్రామాల్లో తిరిగే అవకాశమివ్వొద్దని పిలుపునిచ్చారు. మండలంలోని మాణిక్యారం గ్రామంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అద్భుత పథకాలు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ లేవని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. అయినా 2014కు ముందు తెలంగాణ ఎలా ఉండేదో, తెలంగాణ వచ్చాక ఎంతటి అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
ప్రపంచ పటంలో తెలంగాణను వేగుచుక్కగా చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని గుర్తుచేశారు. అందుకే దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారన్నారు. తొలుత తెలంగాణ రైతాంగ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమకారులను సన్మానించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు హారతిపట్టి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రాములునాయక్ గ్రామంలోని సమ్మక్క-సారక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, నల్లమల వెంకటేశ్వరరావు, మాలోత్ శకుంతల, పెద్దబోయిన ఉమాశంకర్, ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, తోటకూరి పిచ్చయ్య, దుగ్గినేని శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, మాలోత్ కిశోర్, అజ్మీరా వీరన్న, పప్పుల నిర్మల, బానోత్ పద్మావతి, నర్సింగ్ శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, అడప పుల్లారావు, అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.